జమ్ముకశ్మీర్లో లష్కరో తోయిబా నెట్వర్క్ ను భద్రతాదళాలు ఛేదించాయి. సరిహద్దులోని రాజౌరి, పూంచ్ జిల్లాల నుంచి జమ్మూ డివిజన్లో పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు కీలక సభ్యులను అరెస్టు చేశారు.
గత మూడేళ్లుగా రాజౌరీ-పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, దాడుల్లో కీలకపాత్ర పోషించిన లష్కరేటర్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ షా అలియాస్ అబు అహ్మద్ అరెస్టయిన వారిలో ఉన్నాడని ఏడీజీపీ (జమ్మూ జోన్) తెలిపారు. తాలిబ్ తోపాటు అతని సహచరుల అరెస్టుతో.. టార్గైన్ హత్య కేసు, కొట్రాంక పేలుడు, రంజీత్ సింగ్పై కాల్పులు, జుగ్గీ గ్రెనేడ్ కేసు సహా షాపూర్ గ్రెనేడ్ కేసులను ఛేదించామని ఆయన తెలిపారు.
“భద్రతా బలగాలు, మైనారిటీ వర్గాలు సహా ఆ ప్రాంతంలోని ప్రముఖ రాజకీయ నేతలపై తీవ్రవాద దాడులను నిర్వహించే బాధ్యత తాలిబ్పై ఉంది” అని ADGP అన్నారు. డ్రోన్ డ్రాప్ అండ్ కలెక్షన్ కు సంబంధించిన ఐదు ప్రధాన సంఘటనలలో తాలిబ్ ప్రమేయం ఉందని దర్యాప్తు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో అతను పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు సహా భారత కరెన్సీని అందుకున్నాడని తెలిపింది.