తెలంగాణ పర్యటనలో బిజీబీజీగా గడిపారు ప్రధాని నరేంద్రమోదీ. 11,300 కోట్ల పనులకు ఇవాళ ఆయన శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు… . సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు, జంటనగరాల్లో 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ.7,850 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులు, ఐదు జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.