కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ నాయకురాలు రాజ్యశ్రీ చౌదరి ప్రకటించిన నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. మథురలో శాంతి మరియు ప్రశాంతతకు భంగం కలిగించడానికి ఎవరినీ అనుతించబోమని మేజిస్ట్రేట్ నవనీత్ సింగ్ అన్నారు. అటు నారాయణ సేన సైతం అక్కడి మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్రామ్ ఘాట్ నుంచి శ్రీకృష్ణ జన్మస్థలం వరకు మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో సేన కార్యదర్శి అమిత్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు, అయితే దాని జాతీయ అధ్యక్షుడు మనీష్ యాదవ్ను లక్నోలో అదుపులోకి తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. స్థానిక ఎస్పీ, కలెక్టర్ అక్కడి ఆలయాలు ఈద్గాలో భద్రతను సమీక్షించారు. మసీదులో విగ్రహప్రతిష్టాపనకు మహాసభ అనుమతి కోరిందని..అయితే శాంతిభద్రతలకు విఘాతం గలిగించే ఏ కార్యక్రమానికీ అనుమతివ్వబోమని అధికారులు తెలిపారు. అటు రాజ్యశ్రీ మాత్రం డిసెంబర్ 6న షాహీదర్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్నారు. 1992లో డిసెంబర్ 6నే అయోధ్యలో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు.