భారతదేశంలోనే పాత్రికేయ దిగ్గజం రామోజీరావు అస్తమించారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు అనంతరం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీకి తరలించారు బంధుమిత్రులు అభిమానుల కడసరచూపు కోసం అక్కడే ఉంచుతున్నారు ఆదివారం ఉదయం నిర్వహిస్తారు.
సాధారణంగా ఏదైనా ఒక రంగంలో అగ్రస్థాయికి చేరుకున్నాక వారి ఇంటర్వ్యూలు పత్రికలు టీవీ చానల్స్ డిజిటల్ మాధ్యమాల్లో కనిపిస్తాయి. నాలుగు దశాబ్దాలుగా మీడియాను శాసిస్తున్న రామోజీరావు ఇంటర్వ్యూలు మాత్రం పెద్దగా కనిపించవు. ఈనాడుకి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1999లో తీసిన ప్రత్యేక సంచికలో మాత్రం ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా చూస్తే రామోజీ జీవితంలో చాలా విశేషాలు కనిపిస్తాయి.
ఈనాడు పత్రికను ప్రారంభించడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అప్పటికే మార్గదర్శి చిట్ఫండ్ సంస్థను రామోజీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ పనుల మీద విమానంలో వెళుతుండగా అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు తో మాట్లాడడం జరిగింది. అప్పట్లో పత్రికలు విజయవాడలో అచ్చు అవుతూ ఉండేవి రైళ్ల ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి బస్సుల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవి. అందువల్ల 10 గంటలకు 11 గంటలకు పత్రికలు వస్తూ ఉండేవి. ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి వేకువ జామునే పత్రికను అందిస్తే విజయం ఖాయమని రామోజీ నమ్మారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రను టార్గెట్ చేసుకుని 1975లో విశాఖపట్నంలో ఈనాడు పత్రిక ప్రారంభించారు. తర్వాత ఏడాది హైదరాబాదులో ఈనాడు ఎడిషన్ ని తెరిచారు. ఉషా కిరణాలు (సూర్యోదయం) కన్నా ముందే పత్రికను ప్రతి ఇంటికి చేర్చాలి అనేది ఆయన లక్ష్యం. అందుచేతనే ఆయన సంస్థ పేరు కూడా ఉషోదయ అని పెట్టుకున్నారు.
ఈ ప్రణాళిక విజయవంతం కావడంతో తెలుగునాట ఈనాడు దూసుకెళ్లిపోయింది. కొంతకాలానికి హ్యాకర్లు సమ్మె చేయడంతో పత్రిక సరఫరా నిలిచిపోయింది అప్పుడు ఈనాడు ఉన్నతాధికారులంతా రంగంలోకి దిగి వేకు జామునే పత్రికను అందరికీ పంచడం ద్వారా గెలుపు సాధించారు. దీంతో ఈనాడు నెంబర్ వన్ పత్రికగా అవతరించింది. అది మొదలుకొని నేటిదాకా సుమారు 40 ఏళ్ల కు పైగా ఈనాడు నెంబర్ వన్ స్థానంలో నిలబడింది.
సంక్షోభం వచ్చిన ప్రతిసారి కొత్త ప్రయోగంతో ముందుకు వెళ్లడం రామోజీకి అలవాటు. అప్పట్లో పాత్రికేయులు అంటే తెలుగు సాహిత్యంలో తల పండిన వారే ఉండేవారు. ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి నేరుగా రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా గ్రామాల్లోని యువతకు ద్వారాలు తెరిచారు. ఎటువంటి రికమండేషన్లు లంచాలు లేకుండా నేరుగా జర్నలిస్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించారు తెలుగు నాట వేల మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతున్న ఘనత ఈనాడుది.
80వ దశకంలో ఉదయం పత్రిక నుంచి పోటీ వస్తున్నప్పుడు జిల్లా ట్యాబ్లాయిడ్ లు ప్రారంభించారు. దేశంలోనే ఈ ప్రయోగం సంచలనాత్మకం అయిపోయింది.
90వ దశంలో వసుంధర సినిమా ఫైనాన్స్ ప్రతిభ వంటి ప్రత్యేక పేజీలు పెట్టడం ద్వారా మరోసారి ఈనాడు పై చేయి సాధించింది దీంతో ఈనాడు పత్రిక ఇంటిల్లిపాదీ కి అవసరమైన వస్తువుగా మారిపోయింది.
2000 సంవత్సరం తర్వాత డిజిటల్ రంగంలోకి ఈనాడు ప్రవేశించి సమగ్రంగా విస్తరించింది అంతకుముందే టెలివిజన్ రంగంలోకి ఈనాడు ప్రవేశించింది తెలుగు నాట మొట్టమొదటి టెలివిజన్ ఈనాడుదే కావడం విశేషం. ఐదారేళ్లకు తెలుగునాట మొదటి న్యూస్ ఛానల్ ను కూడా ఈనాడు సంస్థ ప్రారంభించింది. ఈటీవీ పేరుతో టెలివిజన్ రంగంలో అగ్రస్థాయిలో నాణ్యతతో కూడిన ప్రసారాలు సాగుతున్నాయి. ఈటీవీ తర్వాత కాలంలో బెంగాలీ కన్నడ మరాఠీ గుజరాతి వంటి భాషల్లో చానల్స్ ప్రారంభించింది.
డిజిటల్ రంగం విస్తరిస్తున్న తరుణంలో ఈనాడు భారత్ పేరుతో కొత్త తరానికి సేవలు మొదలుపెట్టారు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ వెబ్సైట్లు వీడియో ప్రసారాలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా రంగంలో ఈనాడు సంస్థ అన్ని విభాగాల్లోనూ సమాచారాన్ని అందిస్తోంది నెంబర్ వన్ గా నిలుస్తుంది.
ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రామోజీరావు గారికి సినిమాలు అంటే బాగా ఇష్టం. దాదాపు పాతిక సంవత్సరాల పాటు అనేక అభిరుచి గల సినిమాల్ని ఆయన నిర్మించారు. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా 100 సినిమాల్ని తెలుగు వాళ్ళకి చేర్చగలిగారు సినిమా నిర్మాణంలోని అన్ని సేవల్ని ఒకచోటకు చేర్చి రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు ఇది దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా నిలుస్తుంది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కళాంజలి ప్రియా పచ్చళ్ళు రామోజీ డిజిటల్ రమాదేవి పబ్లిక్ స్కూల్ వంటి ఎన్నెన్నో వ్యాపార సంస్థల్ని రామోజీరావు నిర్వహిస్తూ వచ్చారు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఆయా సంస్థలు అగ్రశ్రేణిలో నిలవడం చెప్పుకోదగిన విశేషం.
ఇక రామోజీరావు వ్యక్తిగత విశేషాలు చూస్తే.. పల్లెటూరి రైతు కుటుంబం జీవితాలవాట్లే కనిపిస్తాయి. ఇద్దరు అమ్మాయిల తర్వాత కొడుకుగా జన్మించి, గవర్నమెంట్ స్కూలు కాలేజీల్లోనే చదువుకున్నారు. సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవడం ఉదయం పూట కచ్చితంగా గంట సేపు వాకింగ్ చేయడం ఆయన అలవాటు. ప్రతిరోజు ఈనాడు పత్రికను క్షుణ్ణంగా చదివి తప్పొప్పులు సమీక్ష చేసేవారు. ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ లోనే తళతళ లాడుతూ కనిపించడం అలవాటు. రామోజీ గ్రూప్ సంస్థల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తారు. ప్రతి నెల 30వ తేదీనే కచ్చితంగా జీతాలు చెల్లించడం ఆయనకు అలవాటు. తెలుగు నాట అన్ని పత్రికల ఎడిటర్లు ఒకప్పుడు ఈనాడు పాత్రికేయులే కావడం విశేషం. ఆరోగ్యానికి పెద్దపీట వేసే రామోజీ రావు.. బడా పారిశ్రామికవేత్తలకు ఉండే ఎటువంటి అలవాట్ల జోలికి పోలేదు. వ్యాపార సంబంధాల నిర్వహణలో కూడా అతిథుల్ని ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టి పంపించడం ఆయన అలవాటు. రామోజీరావు.. మంచి భోజన ప్రియులు. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన వ్యాపార సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. మీడియా రంగంలో రామోజీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం.. పద్మ విభూషణ్ పురస్కారం తో సత్కరించింది.