
file photo
ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండో చార్జీషీట్ను ఫైల్ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. చార్జిషీట్లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా చార్జిషీట్లో వైసీపీ ఎంపీ మాగుంట పేరును కూడా చేర్చారు. 428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్ను ఈడీ విడుదల చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మొత్తం నడిపించింది విజయ్ నాయరే అని ఈడీ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్లోనే లిక్కర్ స్కామ్కు సంబంధించిన తతంగం నడిచినట్లు ఈడీ పేర్కొంది.