కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈనెల 23న మ.3.30 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి 3.50కి నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. సాయంత్రం 4 గం.కు ఆస్కార్ విజేతలైన RRR టీంతో తేనీటి విందు ఉంటుంది. ఇక సాయంత్రం గం.5.15కు నోవాటెల్ నుంచి చేవెళ్లకు బయల్దేరుతారు. సాయంత్రం 6 గంటలకు సభా వేదికవద్దకు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.50 గం.లకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. అమిత్ షా కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేశారు.