ఒడిశాలో పాస్టర్ బజిందర్ సింగ్ భారీ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అనేక హిందూ సంస్థలు సహా SC-ST హక్కుల ఫోరం అతనిపై ఫిర్యాదు చేసాయి,దీంతో పాస్టర్ పరారీలో ఉన్నాడు.
కళింగ రైట్స్ ఫోరమ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(NCST)ని కలిసి.. బజిందర్ సింగ్ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహాయం చేసినందుకు బలంగీర్ సబ్-కలెక్టర్పై ఫిర్యాదు చేయాలని కోరింది.
పాస్టర్ బజిందర్ సింగ్ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఒడిశాలోని బలంగీర్లో రెండు రోజుల భారీ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఈవెంట్ పోస్టర్లను ఫోరమ్ ట్విట్టర్లో షేర్ చేసింది. రాష్ట్రంలో మతమార్పిడి నిరోధక చట్టం ఉన్నప్పటికీ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బజిందర్ సింగ్పై ఫిర్యాదు చేయడానికి సబ్ కలెక్టర్ను కూడా కలిశామని చెప్పారు. అయితే సబ్కలెక్టర్ ఆ కథనాలను తోసిపుచ్చుతూ తనను కలవడానికి ఎవరూ రాలేదన్నారు. ఫోరమ్ వర్కర్స్ సబ్ కలెక్టర్ను కలిసిన ఫోటోలను షేర్ చేశారు. సబ్ కలెక్టర్ పాస్టర్పై ఫిర్యాదు స్వీకరించలేదని చెప్పారు.
https://twitter.com/lawinforce/status/1530584125760868352?s=20&t=qkiBewcg-QD9LC9XjWEngA
ఆ తర్వాత SC-ST రైట్స్ ఫోరమ్ బజిందర్ సింగ్పై బలంగీర్ SPకి ఫిర్యాదు చేసింది. ఒడిషా ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ యాక్ట్ & డ్రగ్స్ & మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం కింద చర్య తీసుకోవాలని కోరింది.
“అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ బజిందర్పై కలెక్టర్ మరియు బలంగీర్ ఎస్పీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మరియు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సబ్ కలెక్టర్ అనుమతి ఇచ్చారు” అని కళింగ ఫోరమ్ ట్వీట్ చేసింది.
వివాదాస్పద పాస్టర్ వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. బజిందర్ సింగ్ మిషనరీ కార్యకలాపాల కోసం పిల్లల దోపిడీపై విచారణకు మొహాలీ కమిషనర్ ఇది వరకే ఆదేశించారు.