కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం… కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. దళితులపై కేసీఆర్ కు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. మొన్నటి వరకూ సీఎం కార్యాలయంలో గిరిజన, దళిత, బీసీ, మైనారిటీలు ఒక్కరు కూడా లేరన్న ఈటల దళితబంధు, వాళ్లకు మూడెకరాలంటూ మోసం చేశారని మండిపడ్డారు.
దేశంలోనే అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని చెబుతున్న ఆయన… అమరులు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు.రైతులు, మహిళలు, నిరుద్యోగుల కళ్లల్లోనూ ఆయన మట్టి కొట్టారన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో, అసెంబ్లీలో మాట్లాడిన మాటలను.. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనించాలని ఈటల కోరారు.