మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత డిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు అధికారులను బెదిరించినట్టు తెలిసింది. తమను బెదిస్తున్నారని. దూషిస్తున్నారని…ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదిలేదని వార్నింగ్ ఇస్తున్నారంటూ జైలు అధికారులు జైళ్లశాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలతో సత్యేంద్ర జైన్ ఈడీ మే 31 న అరెస్ట్ చేసింది. ఇదిలావుండగా, సత్యేందర్ జైన్ ఈ జైలులో విలాస జీవితం గడుపుతున్నట్టు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. జైలు గదిలోనే మసాజ్ చేయించుకుంటున్న,ప్రత్యేక ఆహారాన్ని పొందుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.