శ్రద్ధావాకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ జరగనుంది. బెయిల్ కావాలంటూ ఢిల్లీ సాకేత్ కోర్టును ఆశ్రయించాడు ఆఫ్తాబ్. ఈనెల 23 వరకూ అఫ్తాబ్కు జ్యుడిషియల్ కస్టడీ విధించగా, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో అతను ఉన్నాడు. ఢిల్లీలో తనతో సహజీవనం సాగిస్తున్న 27 ఏళ్ల శ్రద్ధావాకర్ను అఫ్తాబ్ ఇటీవల అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆమెను 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచి ఉంచి, రోజుకు కొన్ని ముక్కలు చొప్పున నగర శివార్లలోని అడవుల్లోకి విసిరేశాడు. అఫ్తాబ్ హత్యానేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అటు ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ పరీక్షల్లో కీలక పురోగతి సాధించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఎముకల డీఎన్ఏ శాంపుల్స్, శ్రద్ధావాకర్ హత్య జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన రక్తం నమూనాలు, ఆమె తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ శాంపుల్స్తో సరిపోలాయని తెలిపారు.
https://twitter.com/ANI/status/1603647115988647936?s=20&t=Zzdwfi0xX3zelUXCNoaFCQ