మిసెస్ వరల్డ్ -2022 కిరీటం 21 ఏళ్ల తరువాత ఇండియాకు దక్కింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పోటీల్లో పాల్గొన్నారు. వారందర్నీ వెనక్కి నెట్టి ముందు నిలిచింది సర్గం. మిసెస్ వరల్డ్-2021 విజేత అయిన అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్.. సర్గమ్ కౌశల్ కు కిరీటాన్ని బహూకరించారు.