కరోనా ఉధృతమవుతున్న పరిస్థితుల్లో హైకోర్టులో దానిపై విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్సలు, అడ్డుకట్టవేసే చర్యలపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పీఆర్టీపీసీఆర్ టెస్టులు ఇంకెప్పుడు వేగవంతం చేస్తారని సర్కారును న్యాయస్థానం ప్రశ్నించింది.
సెకండ్ వేవ్ వ్యాపిస్తోందని తెలిసీ ఎందుకు సిద్ధంకాలేదని…రెండోదశ పూర్తిగా వ్యాప్తిచెందాక కానీ మేల్కొనరా అని ప్రశ్నించింది. రాత్రి కర్ఫ్యూ అమలుచేస్తే సరిపోతుందా..సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్ లపై ఆంక్షలేవీ…ఎన్నికల ర్యాలీలపై ఆంక్షలెందుకు లేవు..పెళ్లిళ్లు, అంత్యక్రియలకు నిబంధనలున్నప్పుడు ఎన్నికలెందుకు అతీతమని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా మరణాలపైనా ప్రభుత్వానివన్నీ కాకిలెక్కలేనన్న ఆరోపణలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యచేసింది.