జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) నియమించింది. పండిట్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు.
59 ఏళ్ల శాంతిశ్రీ కూడా జేఎన్యూ పూర్వ విద్యార్థి. అక్కడే ఆమె ఎంఫిల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పిహెచ్డి చదివారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ను జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా నియమించడానికి ఆమోదించారు. ఆమెను ఐదేళ్ల కాలపరిమితితో నియమించామని సీనియర్ MoE అధికారి తెలిపారు.
శ్రీమతి పండిట్ 1988లో గోవా విశ్వవిద్యాలయం నుండి తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి, 1993లో పూణె విశ్వవిద్యాలయానికి మారారు. ఆమె వివిధ విద్యాసంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పదవిని నిర్వహించారు. ఆమె యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సభ్యురాలు అంతే కాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకుల నామినీగా కూడా ఉన్నారు.
ఆమె కెరీర్లో 29 మంది పీహెచ్డీలకు మార్గదర్శకత్వం వహించారు. జేఎన్యూలో ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత తాత్కాలిక వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం జగదీష్ కుమార్ గత వారం యూజీసీ చైర్మన్గా నియమితులయ్యారు.