ఈ శనివారం నాడు సంకటహర చతుర్థిగా పండితులు చెబుతున్నారు ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చి చవితి రోజుని సంకటహర చతుర్థిగా పాటించడం మానవాళికి సంకటాలు లేదా కష్టాలు లేదా అవాంతరాలను అధిగమించి నివారణ చేసే దైవంగా వినాయకుడిని చెప్తారు అందుచేత సంకటహర చతుర్ధి రోజు వినాయకుని ఇష్టమైన ద్రవ్యాలతో పూజ చేయడం ఎంతెంతో శుభకరం.
గణపతికి గరికతో పూజ చేస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.
గణపతి ని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.
గరిక పత్రి న్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.
భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది సంకట హర చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయి. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ 21 సార్లు పఠించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి.
విఘ్నాలు అవాంతరాలకు వినాయకుడు కీలకం అందుచేత వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు అవాంతరాలు తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరుతాయి ఇది తథ్యం