78 ఏళ్లక్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయర్లో దిగిన జ్ఞాపకార్థం ‘సంకల్ప్ స్మారక్’ ని జాతికి అంకితం చేశారు. అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 29 డిసెంబర్ 1943లో నేతాజీ అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతీ ఏటా డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. INA సుప్రీం కమాండర్ అయిన నేతాజీకి ఆనాడు అండమాన్ నికోబార్ దీవులను అప్పగించింది జపాన్ ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు చేసిన స్మారకం పైభాగంలో నేతాజీ విగ్రహం ఉంటుంది. నాడు నేతాజీ విమానం ల్యాండ్ అయిన చోటనే స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో అది జపాన్ ఎయిర్ స్టేషన్ గా ఉండేది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సంకల్ప స్మారక్ ను ఆవిష్కరించింది. నావల్ ఎయిర్ స్టేషన్లోని INS ఉత్క్రోష్ భారత నావికాదళం నిర్వహణలోనే ఉంది. పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం రన్ వే సమీపంలోనే ఎయిర్ స్టేషన్ ఉంది. నేతాజీకే కాదు…ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ప్రతీ సైనికుడి గుర్తుగా ఈ స్మారకం అని… వాళ్ల రేపటిని మన నేటికోసం వారంతా త్యాగం చేశారని జనరల్ అజయ్ సింగ్ అన్నారు.