శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్ కు చెందిన అలీబాగ్ లోని భవంతిని ఈడీ జప్తు చేసింది. 1,034 కోట్ల విలువైన పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో ఆయన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ మీడియాకు తెలిపింది.
తమ నేతల్ని కేంద్రం టార్గెట్ చేసిందని ఇప్పటికే శివసేన ఆరోపిస్తోంది. ఇప్పుడిక రౌత్ పై చర్యలు మొదలయ్యాయి. పార్టీలో నెంబర్ టూగా చెప్పేరౌత్…శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్ కూడా. పలు కేసుల్లో ఇప్పటికే శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన దాదాపు అర డజను మంది కీలక నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)