మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది కోర్టు. సెప్టెంబర్ 19 వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రాతాచల్ రీ డెవలప్మెంట్ కేసులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఆగస్టు 1న ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. తరువాత కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.నేటితో కస్టడీ ముగియడంతో రౌత్ ను కోర్టులో హాజరుపరిచారు. అయితే విచారణ ఇంకా పూర్తికానందున కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. మరోవైపు రౌత్ కూడా బెయిల్ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఈడీ విజ్ఞప్తిని కోర్టు అంగీకరిస్తూ కస్టడీని పొడిగించింది.