తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపునకు అనుమతి లభించింది. సంజయ్ యాత్రను నిలిపివేయాలని, జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఆగిన చోటే పాదయాత్ర ప్రారంభించవచ్చని తెలిపింది.