భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మరికొన్ని దేశాలూ భారత్ నుంచి ప్రయాణాలు రద్దు చేశాయి. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా ప్రభుత్వాలు కొన్ని రోజులపాటు భారత్ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించారు. గత 14 రోజుల నుంచి భారత్ నుంచి యూఏఈకి వెళ్లిన వారిని తిరుగు ప్రయాణాలకు అనుమతించబోమని ఆదేశం స్పష్టం చేసింది. అయితే డిప్లమేటిక్ పాస్పోర్ట్ ఉన్న వాళ్లు, యూఏఈ పౌరసత్వం ఉన్నవాళ్లు, అధికారిక సమావేశాలకోసం వచ్చినవారిపై ఆంక్షలనుంచి మినహాయింపు ఇచ్చారు.