హైందవ సమాజాన్ని జాగరుక పరిచే దిశగా అద్భుతంగా పనిచేస్తున్న సంస్థ సమరసతా వేదిక. ఇందులో భాగంగా వివిధ వర్గాల ప్రజల్ని సంపర్కం చేసేందుకు బృహత్తర కార్యక్రమం తలపెట్టారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాల్ని కలుసుకొంటూ గృహ సంపర్కం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ కార్యకర్త తరలి వెళ్లి ఆత్మీయంగా గడుపుతూ ముందుకు సాగారు.
హైందవ సమాజంలో అన్ని వర్గాలు సమానమే. విదేశీ పాలకుల స్వార్థంతో హైందవ సమాజంలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొన్నారు. దీంతో సమాజంలో కులాలు, వర్ణాలు అంటూ చీలికలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలను పూడుస్తూ సమరసతా వేదిక.. ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ అంతటా వెయ్యికి పైగా కుటుంబాలను కలిసి హైందవ సందేశాన్ని అందించటం జరిగింది. ఈ సంపర్క కార్యక్రమంలో అనేక మంది సమరసత కార్యకర్తలు పాలు పంచుకొన్నారు.
సమరసతా వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాల దగ్గరకు కార్యకర్తలు తరలి వెళ్లారు. అక్కడ వాతావరణంలో ఆత్మీయంగా కలిసిపోయి హైందవ సందేశాన్ని చేరవేశారు. విదేశీయుల కుట్రలు, సెక్యులరిస్టుల దొంగ ప్రచారాల గురించి అవగాహన కల్పించారు. మనమంతా ఒకటే, భరత మాత బిడ్డలం అన్న సందేశాన్ని తెలియచేశారు.
సమరసతా సందేశం అందించిన ప్రతీ చోట చక్కని స్పందన కనిపించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక కుటుంబాలు ఈ సందేశాన్ని సాకారాత్మకంగా స్వీకరించాయి. మంచి విషయాలు తెలియచెబుతున్న సమరసతా కార్యకర్తలను అభినందించారు. వెయ్యు కుటుంబాలను కలుస్తూ సందేశాన్ని అందించటం చక్కటి విషయంగా నిలుస్తోంది.
సమరసతా వేదిక నిర్వహించిన కార్యక్రమం పూర్తి ఫలప్రదంగా సాగింది. కార్యకర్తల చొరవతో ఇంతటి కార్యక్రమం నిర్వహించటం సాధ్యం అయిందని అనుకోవాలి.