సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనీష్ జగన్ అగర్వాల్ మణిపూర్ అమ్మాయి లిసిప్రియ కంగుజామ్ను విదేశీ పర్యాటకురాలిగా తప్పుగా భావించి, తాజ్ మహల్ దగ్గర ఆమె ఫోటోను ఉపయోగించి బీజేపీపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. లిసిప్రియ సహా ఇతరులు ట్విట్టర్లో అగర్వాల్ తప్పును ఎట్టి చూపి అతనిపై విరుచుకుపడ్డాడు.
తాజ్ మహల్ దగ్గర ప్లాస్టిక్ కాలుష్యాన్ని చూపిస్తున్న ఫోటోను లిసిప్రియ ట్వీట్ చేసింది. సమాజ్వాదీ పార్టీ డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ మనీష్ జగన్ అగర్వాల్ ఫోటోతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.
“విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తమ పనితనం గురించి అద్దం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో యమునా నది నిండా మురికిగా ఉంది, తాజ్ మహల్ అందానికి ఇది మాయని మచ్చ.. విదేశీ పర్యాటకులు ప్రభుత్వానికి నిందించడం చాలా సిగ్గుచేటు” అని లిసిప్రియ ఫోటోను ఉపయోగించి అతను ట్వీట్ చేసాడు.
తనను విదేశీ పర్యాటకురాలిగా పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన లిసిప్రియ వినయంగా బదులిచ్చారు.
“హలో సర్, నేను గర్వించదగిన భారతీయురాలిని. నేను విదేశీయురాలిని కాను” అంటూ రీట్వీట్ చేసింది.
Hello Sir,
I'm a proud Indian. I'm not a foreigner. 🙏 https://t.co/KBshDFJzQM— Licypriya Kangujam (@LicypriyaK) June 22, 2022