అయోధ్య రామమందిరం నిర్మాణంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. శ్రీరాముడు, జానకీమాత విగ్రహాలను తయారు చేయడం కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలను రప్పించారు. జనవరి 28న నేపాల్ నుంచి అవి మొదలై…బుధవారమే అవి అయోధ్యకు చేరుకున్నాయి. సీతాదేవి జన్మస్థలం నేపాల్లోని జనక్ పూర్. ఈ సాలగ్రామాలను ముందు నేపాల్లోని కాళీ గండకి, గాలేశ్వర్ నుంచి జనక్ పూర్ ధామ్ లో ఉన్న జానకీమాత ఆలయానికి తీసుకెళ్లారు. ఈ శిలలు మ్యగ్డి, ముస్టాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కాళీ గండకి నది పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణుమూర్తిగా ఆరాధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.