మోదీ వారణాశి పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. భద్రతాధికారులే అవాక్కయ్యారు. ప్రధాని విశ్వనాథాలయం సమీపానికి చేరుకోగానే… ఓ సాధువు హఠాత్తుగా మోదీ వాహనంవైపు వచ్చారు. మోదీ పర్సనల్ సెక్యూరిటీ సహా..అక్కడున్న భద్రతాధికారులు అడ్డుకుంటున్న వినకుండా దూసుకెళ్లారు. సిబ్బంది కంగారుపడినా…. మోదీ మాత్రం ఆయన్ని చూసి వాహనం ఆపమని డ్రైవర్ కు చెప్పారు. వేగంగా మోదీని చేరుకున్న ఆ వ్యక్తి తాను తెచ్చిన తలపాగాను
మోదీ శిరసుపై ఉంచారు. శాలువాతో సత్కరించారు. మోదీ ఆమ్ ఆద్మీ నాయకుడంటూ ఈ వీడియోను బీజేపీ నాయకులు తెగవైరల్ చేస్తున్నారు.