వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు ఎంతటివాడికైనా శిక్షపడాల్సిందేనని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె మృతి కలిచివేసిందన్న మంత్రి ….దోషి సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టబోమన్నారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హన్మకొండ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.