ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను ఆమె స్నేహితుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 20 సార్లు కత్తిపోట్లు పొడిచిన ఆ ఉన్మాది అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో తలపై మోదాడు.
దీంతో తీవ్ర రక్తస్రావమై ఆ బాలిక అక్కడికక్కడే చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.ఆ సమయంలో చాలామంది అక్కడే ఉన్నా ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఓ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ అమ్మాయిని కాపాడలేకపోయారు.
సాహిల్ సాక్షిని విచక్షణారహితంగా 20 సార్లు పొడిచాడు. ఢిల్లీలోని షహాబాద్లోని జేజే కాలనీలో ఆమె తన ఇంటి కత్తిపోట్లకు గురైంది. అయితే హత్యకు కారణాలు తెలియలేదు. కాసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
https://twitter.com/OpIndia_com/status/1663090051558051841?s=20