ఉత్తరాఖండ్ జోషిమఠ్ ప్రాంతంలో హఠాత్తుగా భూమి కుంగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 30 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాయి. జోషిమఠ్ లోని 9 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ దాదాపు 5 వందల ఇళ్లు ఉన్నాయి. అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొన్నిచోట్ల కిందనుంచి నీళ్లు ఉబికివస్తున్నాయి. కారణాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు ఆప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. అక్కడి పరిస్థితిపై స్పందించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి త్వరలోనే జోషి మఠ్ వెళ్తానని…అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు.