నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ. ‘సత్యం పలకడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబెల్నే’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి జయం కలగాలని ఆకాంక్షించారు.
ఎప్పుడు సత్యం చెప్పినా మైనారిటీలకు కోపం వస్తుందని… తమ మతంపై దాడులు జరుగుతుంటే సంయమనం పాటించాలని అంటారనీ అన్నారు. ఓ మాటన్నందుకే కమలేశ్ తివారీని హత్య చేశారని ..ఇప్పుడు నూపుర్ శర్మనూ చంపేస్తామంటున్నారు. భారత్ హిందువులదని.. సనాతన ధర్మం ఇక్కడ శాశ్వతంగా ఉంటుందని అన్నారు. జ్ఞానవాపిలో అంశాన్ని ప్రస్తావించిన సాధ్వి… శివలింగాన్ని ఫౌంటెన్ అని హిందువుల విశ్వాసాలను దెబ్బతీయలేదా అని ప్రశ్నించారు..