రెండేళ్ల క్రితం 2020లో జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత ఆర్మీ జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు.
“దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి 2020, జూన్ 15-16 వ తేదీలలో తమ ప్రాణాలను అర్పించిన గాల్వాన్ వీరులను స్మరించుకుందాం. వారి ధైర్యం, శౌర్యం, అత్యున్నత త్యాగం ఎప్పటికీ మరచిపోలేను. ఆ ధైర్యవంతులకు నివాళులు అర్పిస్తున్నా” అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
Remembering the heroes of Galwan who fought valiantly for the honour of the country and laid down their lives on June 15-16, 2020. Their courage, bravery and supreme sacrifice will never be forgotten. I pay homage to those bravehearts.
— Rajnath Singh (@rajnathsingh) June 16, 2022
దాదాపు 45 సంవత్సరాలలో మొదటిసారిగా 2020, జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక వాగ్వివాదం జరిగింది, ఫలితంగా ఇరువైపులా నష్టం సంభవించింది. ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీ, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) గాల్వాన్ ఘర్షణలపై 14 రౌండ్ల చర్చలు జరిపారు. అయితే ఇంకా ఖచ్చితమైన పరిష్కారం రాలేదు.
కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శ్రీనగర్ వెళ్లారు.