ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని కోరుతూ బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈసారీ అడ్డుకున్నాయి. ఇది దేశంలో సామాజిక నిర్మాణాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నాశనం చేస్తాయని ఆరోపించారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ వాయిస్ ఓటింగ్ నిర్వహించగా… అనుకూలంగా 63మంది వ్యతిరేకంగా 23 మంది ఓటేశారు. కేంద్రంలోని బీజేపీ యూసీసీని అమలు చేస్తామంటుండగా.. విపక్షాలు అడ్డుకుని తీరుతామంటున్నారు.
https://twitter.com/ANI/status/1601154848816525313?s=20&t=e0VpIxrPDez9oPMoCD1iTg