బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు రిషి సునాక్. జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బాలి నుసు దవా కన్వెన్షన్ సెంటర్లో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. రిషి మాట్లాడుతుంటే మోదీ శ్రద్ధగా, ఆసక్తిగా విన్నట్టు కనిపించింది. మధ్యలో ఒకట్రెండు సార్లు రిషి సునక్ భుజం తట్టి ప్రశంసించారు మోదీ.
ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్, మోదీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. బైడెన్ తన వైపే వస్తుండడాన్ని గమనించిన మోదదీ లేచి షేక్ హాండ్ ఇచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తోనూ మోదీ మాట్లాడారు.
Prime Ministers @narendramodi and @RishiSunak in conversation during the first day of the @g20org Summit in Bali. pic.twitter.com/RQv1SD87HJ
— PMO India (@PMOIndia) November 15, 2022
జీ20 లీడర్స్ సమ్మిట్ లో పర్యావరణం, ఆరోగ్యం, ఆహారం-ఇంధన భద్రత, డిజటలైజేషన్, ప్రపంచ వృద్ధి రేటును గాడిన పెట్టడం వంటి పలు అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపైనా మోదీ సమీక్ష చేయనున్నారు. ఇండోనేషియాలో స్థిరపడిన భారతీయులనూ మోదీ కలవనున్నారు ఈ పర్యటనలో.