జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కారణం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం పన్నువసూళ్లు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఇక నవంబర్లో తెలంగాణ నుంచి 4,228 కోట్ల జీఎస్టీ వసూలు కాగా..గతేడాది ఈ సమయంతో పోలిస్తే 8శాతం ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 3,134 కోట్లు కాగా..గతేడాది ఈకాలంతో పోలిస్తే 14 శాతం వసూళ్లు పెరిగాయి.