అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనమవడాన్ని సమర్థిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్టు చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ‘రోఫ్ల్ గాంధీ 2.0’ అనే ఫేక్ ఐడీ నుంచి కేంద్ర మంత్రిని ఎగతాళి చేశారు. ఆమె భారత్ లో లావాదేవీలు యుఎస్ డాలర్లలో లేనందున, భారత రూపాయి విలువ తగ్గడం వల్ల ఆమెపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొన్నట్టు ట్వీట్ చేశారు.
“నా కుటుంబం భారతీయ రూపాయలతో కిరాణా, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తోంది, మేం US డాలర్లను ఉపయోగించం. అలాంటప్పుడు మనం డాలర్ విలువ గురించి ఎందుకు ఆందోళన చెందాలి?” అని నిర్మలా సీతారామన్ అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ట్వీట్ చేశారు.
నిర్మలా సీతారామన్ పై గతంలో కూడా ఇలాగే తప్పుడువార్తలు ప్రచారం చేశారు. కానీ తర్వాత అది అవాస్తవమని తేలింది. తాజా ట్వీట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ అవహేళన చేశారు. మన దేశం ఎందుకు ఆర్థికంగా వెనుకబడిందో ఆమె మాటలను చుస్తే అర్థమవుతోందని.. పనికిరాని మహిళ, ఆమెకు ఏం అర్థం కావడం లేదు, ఆమె ఎప్పుడూ అర్ధంలేని విధంగా మాట్లాడుతుంది అని రీట్వీట్ చేశారు.
https://twitter.com/Dibyend88338661/status/1525079076469456896?s=20&t=BnTLJAWp6ZbXRcDYF3HJ7w
మరి కొందరేమో ఆమె అలా నిజంగానే అన్నారా అని ఆరా తీశారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ట్వీట్లో నిర్మలా సీతారామన్పై తప్పుడు ఆరోపణలను కొట్టివేసింది. రూపాయి, డాలర్ విలువపై ప్రకటన ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, అది నిజం కాదు. ఆర్థిక మంత్రి అటువంటి ప్రకటన ఇవ్వలేదు”అని స్పష్టం చేసింది.
https://twitter.com/PIBFactCheck/status/1525874913013567488?s=20&t=VlJ0b41e8mHQ08SKp21jyQ