విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చినట్టుగానే రుయా ఆసుపత్రి మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని కోరింది.
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని పిటిషనర్ పీఆర్ మోహన్ పిల్ దాఖలు చేశారు. రుయా ఆస్పత్రిపై కేసు నమోదు చేయలేదన్న పిటిషనర్… ఆస్పత్రి తప్పిదమని కలెక్టర్ స్వయానా చెప్పారని గుర్తుచేశారు. ఇంతవరకు ఆస్పత్రిపై FIR నమోదు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది బాలాజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ…వెకేషన్ బెంచ్ తరువాత రోజుకు విచారణ వాయిదా వేసింది.