హైదరాబాద్ లో బస్సుల రద్దీ వెనుక కుట్ర కోణం!
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నరకంగా మారుతోంది. కొందరు ఆర్టీసీ అధికారులు ఆడుతున్న గేమ్ లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలకు బస్సు ప్రయాణంతో చాలా అవస్థలు కలుగుతున్నాయి.
…..
హైదరాబాద్ లోనూ, తెలంగాణ అంతటా ఉచిత బస్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణం పథకాన్ని మహిళలు బాగా ఉపయోగించుకొంటున్నారు. దీంతో బస్సులన్నీ కళకళలాడుతూ ప్రయాణిస్తున్నాయి. టిక్కెట్ కొనే వారి సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో ఆర్టీసీ అధికారుల్లో మథనం మొదలైంది. దీనికి గాను ఆర్టీసీ అధికారులు బాగా ఆలోచించి కొత్తరకం మెలిక పెట్టేశారు.
…..
ప్రయాణికులు ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించేశారు. హైదరాబాద్ విషయమే తీసుకొంటే ముఖ్యమైన రూట్లలో ప్రతీ 5,6 నిముషాలకు బస్సులు కంటిన్యూగా వస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించేసి 20, 30 నిముషాలకు ఒక్కో బస్సును వదులుతున్నారు. మహిళలు కానీ, బస్ పాస్ హోల్డర్లు కానీ … బస్ స్టాప్ లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇంత ఆలస్యంగా బస్సులు రావటంతో అవన్నీ విపరీతంగా కిక్కిరిసి ఉంటున్నాయి. అయినప్పటికీ ఫుట్ బోర్డులలో వేళ్లాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.
..
సాయంత్రం సమయంలో హైదరాబాద్ అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మహిళలు కూడా వేలాడుతూ ఫుట్ బోర్డుల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. అటు ఆర్టీసీ సిబ్బంది కి కూడా డ్యూటీ చేయటం కష్టంగా ఉంటోంది. ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు లు స్పష్టంగా చెక్ చేయాలి. ఆ తర్వాత ఉచిత ప్రయాణం టికెట్ ను అందించాల్సి ఉంటోంది. కిక్కిరిసి పోయిన బస్సుల్లో అదే పనిగా టిక్కెట్లు కొట్టడం కండక్టర్లకు కత్తి మీద సాములా మారుతోంది. దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
….
కేవలం డీజిల్ మిగుల్చుకోవాలన్న కక్కుర్తి కొద్దీ ,, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ గిమ్మిక్కులు చేస్తున్నారు. పైగా చాలా చోట్ల ఎక్స్ ప్రెస్ బస్సులకు రంగు మార్చేసి డీలక్స్ బస్సులుగా మార్చేశారు. దీంతో ఈ బస్సుల్లో మహిళలకు, పాస్ హోల్డర్లను అనుమతించటం లేదు. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు 50, 60 రూపాయలు చెల్లించి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. సాయంత్రం పూట ఆర్టీసీ ఆఫీసర్స్ ఆడుతున్న గేమ్ లు అన్నీ ఇన్నీ కావు అని ప్రయాణికులు తిట్టుకొంటున్నారు.
…
కొందరు ఆర్టీసీ అధికారులు చేస్తున్న కక్కుర్తి పనులతో ప్రజలకు చాలా అవస్థలు కలుగుతున్నాయి. రోజంతా డ్యూటీలు చేసి అలసి పోయి ఇంటికి వెళుతుంటే,, బస్సు ప్రయాణాలతో మరింత అలిసిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ శాపనార్థాలు అన్నీ కాంగ్రెస్ ప్రబుత్వానికి తగులుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి,, మహిళల్లో మంచి మార్కులు రావాల్సింది పోటి,, అనవసరంగా తిట్లు శాపనార్థాలు కలుగుతున్నాయి.