రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి పేటలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూల్ బస్సులో ఉన్న 20మంది విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 10మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తమోడుతున్న చిన్నారులు తల్లడిల్లిపోతూ ఏడుస్తున్న దృశ్యాలు అందర్నీ కదిలించాయి. గాయపడిన వారిని ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డినుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును వెనకనుంచి ఢీకొట్టినట్టు చెబుతున్నారు.