…………….
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఒక్కరు తప్ప విమానంలోని ప్రయాణికులు అందరూ మరణించినట్లు తెలుస్తోంది మరోవైపు విమానం కుప్ప కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ లో కూడా అనేకమంది చనిపోయారు అని అంచనా. ఈ ఆపద సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మరియు సేవా భారతి కార్యకర్తలు.. మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఆపదలో చిక్కుకున్న వారికి… పెద్ద ఎత్తున సేవలు అందించారు.
…………..
అహ్మదాబాద్ ఘటనలో విమానం కూలిన దానికన్నా,, చెలరేగిన మంటలతోనే ప్రమాదం ఎక్కువగా ఏర్పడింది. లండన్ వెళ్లే నాన్ స్టాప్ విమానం కావడంతో ఫుల్ ట్యాంక్ చేయించి పంపించారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానంలోని భారీ ఇంధన ట్యాంకుకి నిప్పు అంటుకొంది. పెద్ద ఎత్తున మంటలు తీవ్రంగా చెలరేగాయి. ఆ మంటల తీవ్రత రెండు మూడు కిలోమీటర్ల వ్యాపించింది అంటే అతిశయోక్తి కాదు. దీంతో ఆ చుట్టుపక్కలకు వచ్చేందుకు జనం భయపడ్డారు.
……………
అంతటి సంక్లిష్ట పరిస్థితులలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి… మంటల వేడిని లెక్కచేయకుండా,, ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు వెంటనే చేరుకున్నారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదం జరిగిన చోట తక్షణ సహాయం లో నిమగ్నం అయిపోయారు. భగభగ మండే అగ్నికీలకల దగ్గర .. ఏమాత్రం చలించకుండా నిలిచి ఉండి,,, స్వయంసేవకులు సహాయ చర్యల్లో పాలుపంచుకున్నారు.
………….
అనంతరం క్షతగాత్రులను మృతదేహాలను కర్నావతి సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా స్వయం సేవకులు బృందాలుగా ఏర్పడి సేవలు అందించారు.
1) రెండు రోజులపాటు మొత్తంగా 175 మంది స్వయం సేవకులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
2) ప్రమాదం జరిగిన చోట ట్రాఫిక్కును నియంత్రించడంలో సహాయపడ్డారు.
3) అప్పటికప్పుడు రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఇతర సహాయ బృందాలకు … తాగునీరు స్నాక్స్ బిస్కెట్లు వంటి తక్షణ అవసరాలను తీర్చారు.
4) ఎక్కడెక్కడ నుంచో వస్తున్న ప్రయాణికుల బంధువులకు అప్పటికప్పుడు ఆహారపు ప్యాకెట్లు తెప్పించి అందించారు.
5) మొత్తంగా 2 వేల మందికి ఆ ఒక్క రోజే స్వామినారాయణ్ మందిర్ సౌజన్యంతో ఆహారాన్ని సమకూర్చగలిగారు.
6) మరోవైపు ఆసుపత్రి దగ్గర చికిత్సల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బ్లడ్ యూనిట్లు అందించారు.
7) వైద్య బృందాలకు అవసరమైన ఇతర సహాయ సామగ్రిని అప్పటికప్పుడు సమకూర్చగలిగారు.
8) మృతదేహాల నుంచి డిఎన్ఏ శాంపుల్స్ ని సేకరించడంలో తోడ్పడ్డారు .
మొత్తం మీద విమాన ప్రమాదం దుర్ఘటన దగ్గర ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మరియు సేవా భారతి కార్యకర్తలు నిశ్శబ్దంగా సేవలు అందించడంలో మునిగిపోయారు. సంఘ్ స్ఫూర్తితో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాల పట్ల స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు