కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని తీవ్రంగా అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ. జూలైలో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఆయన… ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. అన్నేళ్లు పార్టీకి సేవ చేస్తే..తన తండ్రికి అన్యాయం జరిగిందని..అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. తాను అలాంటి అవమానాలే ఎదుర్కొన్నానని అందుకే ఆపార్టీకి గుడ్ బై చెప్పినట్టూ చెప్పుకొచ్చారు.
ఇక ప్రణబ్ నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పలువురు చేసిన వ్యాఖ్యల్నీ గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్సో, నాగ్ పూరో దేశం బయట లేదని…అలాంటప్పుడు ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అక్కడ ఆయన చేసిన ప్రసంగం కూడా దేశానికో సమాజానికో వ్యతిరేక సందేశం ఇచ్చేలా కూడా లేదన్నారు.

File photo