ఆర్ ఎస్ ఎస్ ఈ దేశానికి వెన్నుముక అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ లేని దేశాన్ని, ఈ సమాజాన్ని ఊహించుకోలేము అని ఆయన అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల ఎన్నికల పర్యటనలో కీలక నియోజకవర్గాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వానికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.
మొదటి రోజు డెగ్లూర్లో భారీ ర్యాలీతో ప్రచారం మొదలైంది. చంద్రపూర్లోని బల్లార్షా నియోజకవర్గంలో చాలా చోట్ల ర్యాలీలు మరియు షోలాపూర్లో రోడ్షోలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆయన ప్రసంగాలకు యువత కేరింతలు కొడుతూ హుషారు తెచ్చారు. అనేక చోట్ల పవన్ కళ్యాణ్ ప్రసంగాలు దేశ ఐక్యత, పురోగమనం మరియు చారిత్రక ప్రాముఖ్యత దిశగా సాగాయి.
మహారాష్ట్ర నాయకుల పట్ల తనకున్న అభిమానం చాటుకున్నారు . బాలాసాహెబ్ థాకరే బోధనల నుంచి తాను పొందిన స్ఫూర్తిని నొక్కి చెప్పారు. “నేను బాలాసాహెబ్ని కలుసుకోకపోయినప్పటికీ, సనాతన ధర్మం మరియు ప్రాంతీయ పటిష్టత కోసం నిర్భయంగా నిలబడే ఆయన సూత్రాలు జనసేన సిద్ధాంతంతో లోతుగా ప్రతిధ్వనిస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహారాష్ట్ర కీలక పాత్రను నొక్కి చెప్పారు. గత దశాబ్దంలో ఎన్డిఎ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతిబింబిస్తూ, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం మరియు నాగ్పూర్ను థానేను కలిపే సమృద్ధి మహామార్గ్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వంటి ముఖ్యమైన మైలురాళ్లను ఆయన ఉదహరించారు.
మహారాష్ట్ర అంతటా జరిగిన ర్యాలీలలో, కళ్యాణ్ ప్రసంగాలు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం మరియు అందరికీ సుసంపన్నమైన భవిష్యత్తు కోసం కృషి చేయడం మీద సాగాయి. ప్రజలను ఏకం చేస్తూ “జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర” నినాదాలతో అందరినీ ఆకట్టుకొన్నారు.