ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలకు భారత్ లో ముప్పులేదని నచ్చజెప్పడానికి మోహన్ భగవత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. నాగ్పూర్లో ఉండే బ్రహ్మచారుల కోసం అలవాట్లు,విశ్వాసాలు, తీరును మార్చుకునేందుకు ఇక్కడి ముస్లింలు సిద్ధంగా లేరని ఒవైసీ అన్నారు. అల్లా కోరుకున్నందునే మేం భారతీయులం అయ్యామని…మా పౌరసత్వంపై షరతులు పెట్టేందుకు ఆయనకెంత ధైర్యమని మండిపడ్డారు. హిందువుల ప్రతినిధిగా ఆయన వ్యవహరించదలిస్తే 2024 ఎన్నికల్లో పోటీకి వస్తే స్వాగతిస్తామన్నారు అసద్.