రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మే 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ కోషియారిలో ఉండనున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మమత పలు సూచనలు చేశారు.
బెంగాల్లో మన అతిథులను మనం ఎలా బాగా చూసుకుంటామో వారికి (సంఘ్) అర్థమయ్యేలా ఆర్ఎస్ఎస్ చీఫ్కి కొన్ని స్వీట్లు పంపాలని మమత పోలీసుల అధికారులకు సూచించారు. తమ ప్రభుత్వం అతిథులను సాదరంగా ఆహ్వానిస్తుందని ఆయన భావించాలి అని బెనర్జీ అన్నారు.
ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ నాలుగు రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. మూడు వారాల పాటు శిబిరం జరుగుతోంది.
ఈ సందర్భంగా పొరుగున ఉన్న జార్ఖండ్, బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్కు తుపాకీలతో దుర్మార్గులు వస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.