రోహింగ్యాల సమస్య తమకు తీవ్ర తలనొప్పి వ్యవహారం అయిపోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తమకు పెనుభారం అయిన వారిని తిరిగి మయన్మార్ పంపించేందుకు ప్రపంచదేశాల సాయం కోరుతున్నట్టు తెలిపారు. అందులోనూ పొరుగుదేశం భారత్ కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. నాలుగురోజుల పర్యటనకోసం ఆమె భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా మీడియోతో మాట్లాడారామె. బంగ్లాదేశ్ లో 11 లక్షలమంది రోహింగ్యాలున్నారని… మానవత్వంతో వారికి ఆశ్రయమిచ్చామని ఇంకా ఎంత కాలం దేశంలో పెట్టుకోవాలని ప్రశ్నించారు. స్వదేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని…మాదకద్రవ్యాల అక్రమరవాణాలో ఉన్నది వాళ్లేనని…వాళ్లంతా త్వరగా వాళ్ల దేశం వెళ్లిపోతే మంచిదని ఆమె అన్నారు.