]అటార్నీ జనరల్ గా మరోసారి ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ ఉండడంతో ఆయన స్థానంలో మళ్లీ రోహత్గీ వస్తారని సమాచారం. గతంలో ఏజీగా ఉన్నరోహత్గి 2017లో వైదొలగడంతో నాడు వేణుగోపాల్ ను నియమించింది ప్రభుత్వం. 89 ఏళ్ల వేణుగోపాల్ పదవీకాలం 2020లోనే ముగిసినా ప్రభుత్వం కోరిక మేరకు కొనసాగారు. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇక అక్టోబర్ 1నుంచి రోహత్గీ తిరిగి ఆ బాధ్యతల్లో ఉండనున్నారు.