ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఏపీఎస్ఆర్టీసి బస్సు వాగులో పడిన ఘటనలో తొమ్మిదిమంది ప్రయాణికులు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు. 47 మంది ప్రయాణికులతో నిండిన బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డి గూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ టర్న్ తీసుకుంటుండగా… రైలింగ్ను ఢీకొని అక్కడి జల్లేరువాగులో పడింది. డ్రైవర్ సహా తొమ్మిదిమంది అక్కడికక్కడే చనిపోగా…గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వాగులో ఐదడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.