బ్రిటన్ ప్రధాని రేసులో మున్ముందుకే దూసుకుపోతున్నారు భారతసంతతికి చెందిన రిషి సునాక్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తైన పోలింగ్ లో ముందున్నారు. రెండు రౌండ్ల తరువాత ఐదుగురు బరిలో నిలవగా… గురువారం మరో రౌండ్ పోలింగ్ జరగనుంది. అధికార కన్సర్వేటివ్ పార్టీకి చెందిన టోరీ సభ్యులు తదుపరి నేతను ఎన్నుకోవాల్సి ఉండగా అత్యధికులు రిషివైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఒపీనియల్ పోల్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రిషి అయితేనే దేశానికి మంచి ప్రధాని కాగలరని దాదాపు 4వేల 4 వందల మంది టోరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. 48శాతం సభ్యులు ఆయన వైపు ఉండగా… రిషికి గట్టిపోటీ ఇస్తున్న విదేశాంగమంత్రికి టోరీ సభ్యుల్లో 39శాతం మద్దతుఉంది. జెఎల్ పార్టనర్స్ ఈ పోల్ నిర్వహించింది.