పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారి కోమటిరెడ్డి ఇంటికెళ్లారు రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నేతలూ కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నటికీ కలవబోవని స్పష్టం చేశారు. మోదీ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలను చీల్చే కుట్ర చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటల్ని తెలంగాణ ప్రజలు ఇక నమ్మబోరన్నారు. కేసీఆర్ చెబుతున్నట్టు అది థర్డ్ ఫ్రంట్ కాదు సుపారీ ఫ్రంట్ అని రేవంత్ అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)