టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట హాజరయ్యారు. అయితే రేవంత్ తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. పేపర్ లీక్ వెనక మంత్రి కేటీఆర్ ఉన్నారని… ఆయన పీఏకు చెందిన మండలంలో వంద మందికి వందకుపైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రేవతం ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. అయితే నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలకు సిట్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక అదే సమయంలో అలాంటి వ్యాఖ్యలే చేసిన బండి సంజయ్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కూడా సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించలేదని రేవంత్ పై కనుక సిట్ కేసు నమోదు చేస్తే..సంజయ్ విషయంలో కూడా ఇలాగే ముందుకెళ్తారా అనే చర్చ జరుగుతోంది.
పేపర్ లీకేజీ కేసులో సిట్ ఎదుట రేవంత్ హాజరు – రేవంత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్న సిట్
Share: