తాను తెలంగాణ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు

భద్రత పెంచాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.అయితే యాత్రకు తగిన భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ యాత్రకు ఇబ్బంది కలగకుండా చూడడంతో పాటు తగిన భద్రత ఇవ్వాలంటూ అదనపు డీజీ ఆయా ఎస్పీలకు లేఖ పంపినట్టు కోర్టుకు తెలిపారు. ఆ లేఖను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అయితే భద్రత కల్పించినా కోర్టులో విచారణ జరపాల్సిన అవసరం ఏంటని రేవంత్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో లేదో వివరాలతో కోర్టుకు తెలపాలంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ రేవంత్ పిటిషన్ – భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వం
తాను తెలంగాణ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు
భద్రత పెంచాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.అయితే యాత్రకు తగిన భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ యాత్రకు ఇబ్బంది కలగకుండా చూడడంతో పాటు తగిన భద్రత ఇవ్వాలంటూ అదనపు డీజీ ఆయా ఎస్పీలకు లేఖ పంపినట్టు కోర్టుకు తెలిపారు. ఆ లేఖను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అయితే భద్రత కల్పించినా కోర్టులో విచారణ జరపాల్సిన అవసరం ఏంటని రేవంత్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో లేదో వివరాలతో కోర్టుకు తెలపాలంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Share: