
file photo
తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖరాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరిన రేవంత్ పత్తిధర, రుణమాఫీ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. రైతులను దళారీలు మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని నిలదీశారు రేవంత్. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడంతో పాటు సత్వరమే రుణమాఫీ చేయాలని కోరారు. కొద్దిరోజులుగా క్వింటా 9 వేలు ఉన్న పత్తిధర 7వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దళారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించారని పత్తిరైతులు ఆందోళనకు దిగారు.