కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తామని పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమిలేని రైతులకు 15 వేల రూపాయలిస్తామన్నారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది.దేవరుప్పల మండలం ధర్మాపురంలో పత్తిరైతులతో రేవంత్ మాట్లాడారు. పత్తి చేలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధర్మపురంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను రేవంత్ పరిశీలించారు. ఊరికి దూరంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు నిరుపయోగంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.