కరోనా విలయం నేపథ్యంలో సరిహద్దుల వెంబడి వివాదం నడుస్తోంది. బోర్డర్లో అడ్డుకుంటున్న పరిస్థితి. . అత్యవసర చికిత్స కోసం వెళ్తున్న రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఈ వివాదం మొదలైంది. ఏపీ అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్మిషన్ పత్రాలు ఉన్న వారినే అనుమతిస్తారు
ఆస్పత్రి అనుమతి పత్రాలు తప్పనిసరి అని పోలీసులంటున్నారు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్స్లకు అనుమతి ఇస్తున్నారు. సాధారణ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతం జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. ఆక్సిజన్ కొరత కూడా ఇతర రాష్ట్రాల వారిని అనుమతించకపోవడానికి కారణం కావచ్చంటున్నారు.